గతంలో మధుమేహ సమస్య లేకున్నా గర్భధారణ తర్వాత మధుమేహం వస్తే దానిని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. గర్భిణి శరీరంలో కలిగే హార్మోన్ల గందరగోళం మూలంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం వల్ల ఈ సమస్య వస్తుంది. దీనివల్ల గర్భిణితో బాటు గర్భస్థ శిశువు సైతం పాక్షికంగా ఈ మధుమేహ ప్రభావానికి గురవుతుంది. సాధారణంగా 3, 4వ నెలల్లో కనిపించే ఈ సమస్య కాన్పు తర్వాత దానంతట అదే దూరమవుతుంది. అయితే.. కొద్దిమందిలో ప్రసవం తర్వాత కూడా మధుమేహ సమస్య కొనసాగుతుంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం .. నూటికి 10మంది గర్భిణులు ఈ జెస్టేషనల్ డయాబెటిస్ బారినపడుతున్నారు. అందుకే గర్భిణులు ఈ సమస్య విషయంలో తగిన జాగ్రత్త వహించాలి.
బాధితులు వీరే?
శిశువుకు వచ్చే సమస్యలు
జెస్టేషనల్ డయాబెటిస్ వల్ల వచ్చే మొదటి సమస్య.. గర్భస్థ శిశువు పరిమాణం, బరువు పెరగటం. దీనివల్ల కాన్పు కష్టమవుతుంది. మరో సమస్య.. తల్లికడుపులో ఉన్నప్పటి నుంచే శిశువు మధుమేహ ప్రభావానికి అలవాటు కావడం వల్ల డెలివరీ అయిన వెంటనే శిశువు శరీరంలో షుగర్ లెవల్స్ పడిపోతాయి. దీనివల్ల శిశువును కొంతకాలం ఐసియులో ఉంచాల్సి ఉంటుంది.
అపోహలు
తల్లికి ప్రెగెన్సీలో మధుమేహం వస్తే బిడ్డకూ వస్తుందని అనుకుంటారు. ఇది అపోహే. నిజానికి గర్భిణికి డయాబెటిస్ ఉంటే వెంటనే అది పిల్లలకు సంక్రమించదు. భవిష్యత్తులోనూ తప్పనిసరిగా సంక్రమించాలనే నియమమూ లేదు.
సమస్య ఉన్న గర్భిణులకు సైతం వెంటనే మధుమేహం వస్తుందని అనుకుంటారు గానీ అదీ అపోహే. ఈ సమస్య బారినపడిన గర్భిణుల్లో సగం మందికే.. అదీ కాన్పు తర్వాతి నాలుగైదు ఏళ్లలో మధుమేహం వచ్చే ప్రమాదం ఎదురుకావచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు