ఉన్నట్టుండి శ్వాస తీసుకోలేకపోవటం, భరించలేని ఛాతీనొప్పి కనిపిస్తే అందరూ గుండెపోటే అని అనుకుంటారు గానీ కొన్నిసార్లు ఆ లక్షణాలు ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ (పల్మనరీ ఎంబోలిజమ్-పీఈ) మూలంగానూ కావచ్చు. శరీర భాగాల్లో.. ముఖ్యంగా కాళ్ల ధమనుల్లో రక్తం గడ్డలు కట్టి అవి ఊపిరితిత్తులకు చేరుకొని స్థిరపడటంతో అది క్రమంగా 'పల్మనరీ ఎంబోలిజమ్'కు దారితీస్తుంది. సకాలంలో ఈ సమస్యను గుర్తించి తగు చికిత్స తీసుకోకపోతే ఊపిరితిత్తులు, గుండె కోలుకోలేనిరీతిలో దెబ్బతినే ప్రమాదం ఉంది. సమస్య తీవ్రమయ్యే వరకూ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
ఎవరికి రావచ్చు?
ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టటమనే సమస్య ఏ వయసువారికైనా రావచ్చు. సాధారణంగా రోజంతా ఒకేచోట కూర్చొని పనిచేసేవారికి , మంచాన పడ్డవారికి, ప్రమాదాలు లేదా శస్త్రచికిత్స మూలంగా సిరలు దెబ్బతిన్నవారికి, గుండె సంబంధిత సమస్యలున్నవారికి ఈ సమస్య ముప్పు ఎక్కువ. ఊబకాయులు, గర్భిణులు, బాలింతలకూ ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.
లక్షణాలు
చికిత్స
నిజానికి ఇది ఇబ్బందికర సమస్యే అయినా సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది. సాధారణంగా ఏర్పడిన రక్తం గడ్డలలో కొన్ని వాటంతట అవే కరుగుతాయి. మందుల ప్రభావంతో రక్తం పలుచబడుతుంది గనుక రక్తం గడ్డలు కట్టటం ఆగిపోతుంది.
నివారణ